Home » Tadipatri
టీబీసీ, హెచ్చె ల్సీ సౌతకెనాల్ పనులు నాణ్యంగా చేపట్టాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కాంట్రాక్టర్లను కోరారు. ఆయన ఆదివారం పట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్చెల్సీకి ఇంతవరకు ఇంత మొత్తంలో నిధులు మంజూరు చే యలేదన్నారు.
స్థానిక మండల పరిషత కార్యాలయంలో సోమవారం జరగవలసిన ఉపాధిహామి పథకం పనులు పూర్తిగా స్తంభించాయి. టెక్నికల్ అసిస్టెంట్లు మూకుమ్మడిగా విధులకు డుమ్మా కొట్టడంతో కూలీల బిల్లులు, కొలతల ప్రక్రియ నిలిచిపోయింది.
రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే, పరిష్కరిస్తానని ఎమ్మె ల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలంలో ని తబ్జుల, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన బు ధవారం పర్యటించారు. తబ్జుల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు.
మండలంలోని రాయలచెరువులో నీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు పం పించే ట్యాంకర్ల వద్ద నీటికోసం గుంపులు గుంపులుగా చేరుతున్నారు. రెండురోజులుగా రాయలచెరువులో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు తెలిపారు.
ప్రజలే తన దేవుళ్లని, వారి మధ్యే తన పుట్టిన రోజును ఈనెల 25న వినూత్నరీతి లో జరుపుకుంటానని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆది వార స్థానిక నివాసంలో విలేకరుల సమా వేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత పుట్టినరోజులను సాధారణంగా దివ్యాంగు ల మధ్య జరుపుకొనే వాడినని తెలిపారు.
పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో శనివారం భద్రావతి భావనా రుషీశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపం డితులు జానకిరామశర్మ భద్రావతి భావనా రుషీశ్వరుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవ విగ్ర హాలను అలంకరించి పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో కల్యాణాన్ని ని ర్వహించారు. భక్తులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
దశాబ్దాల తరబడి అర్చక వృత్తిలో ఉంటూ మండలకేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి, కొత్తరాయుడుస్వామి ఆలయాల్లో స్వామివార్లకు సేవలు అందిస్తున్న అర్చకుడు హరికృష్ణశ ర్మను శుక్రవారం ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.
శ్మశాన వాటిక రూపురేఖలు మారుద్దామని, పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శ్మశాన వాటికను గురు వారం ఆయన పరిశీలించారు.
ఐదునెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సత్యసాయి నీటి పథకం కార్మికులు చేపట్టిన స మ్మె గురువారం కొనసాగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వారు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సత్యసాయిబాబా నీటి పథకాన్ని జిల్లా పరిషతకు అప్పగించవద్దని, ట్రస్ట్ ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపల్లిలో రూ.57లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి, కొండేపల్లిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి బుధవా రం ఆమె భూమిపూజ చేశారు.