Home » Tadipatri
పల్లెపండుగ 2025-26 లో భాగంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మూగజీవుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నీటితొట్టె లు ఏర్పాటుచేసింది. ఒక్కొక్క తొట్టె నిర్మాణానికి సుమారు రూ.40వేలు మేర ఖ ర్చుచేసింది
పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో శనివారం పద్మశాలీయ సంఘం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జలదుర్గం దామోదర్దాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంఘం సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలోని రాయలచెరువు గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేద్దామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం బాధాకరమన్నారు. శుక్రవారం రాయలచెరువులో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలను ఆయన పరిశీలించారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది.
తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన సోమవారం స్థానిక పోలీస్ స్టేషన సర్కిల్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పట్టణ సమీపంలోని యల్లనూరు రహదారిలో శనివారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే అశ్మితరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే గేటు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో రూ.49 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రాయలసీమను టూరి జం సర్క్యూట్గా, తాడిప త్రిని టెంపుల్ సిటీగా అ భివృద్ధి చేయాలని మున్సి పల్ చైర్మన జేసీ ప్రభా కర్ రెడ్డి కోరారు. గుత్తి పట్టణం ఫుట్బాల్ క్రీడా మైదానంలో జరిగిన గు త్తికోట ఉత్సవాలలో ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం సమర్పించారు.
శ్రీలక్ష్మీ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో గురువారం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్కు ఉద యాన్నే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం వద్ద హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీలక్ష్మీ వెంకటరమ ణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో బుధవారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 4గంటల నుంచి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు.
మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీలక్ష్మీ వెంకటరమణస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళ వారం గరుడ వాహనంపై స్వా మివారు దర్శనమిచ్చారు. ఉద యాన్నే ప్రత్యేక పూజలు నిర్వ హించారు.