Home » T20 WORLD CUP
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజ్ను అజేయంగా ముగించి.. సూపర్ 8లో తొలి ఓటమిని చవి చూసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లైవ్ అప్డేట్స్
పల్లెకెలె స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 51 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాటర్లు.. 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటయ్యారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో తొలి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. నేడు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. మరికాసేపట్లో ఆట ప్రారంభం అవుతుందనగా.. భారీ వర్షం మొదలైంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచ కప్ 2026లో తీవ్రంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో డకౌట్గానే వెనుదిరిగాడు. దీంతో అతడి ఫామ్పై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ ఫామ్పై స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ప్రొటీస్ కోచ్ షుక్రి కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో ఎనిమిది జట్లు సూపర్ 8కి అర్హత సాధించాయి. వీటిని నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్లుగా ఐసీసీ విభజించింది. అయితే ఈ గ్రూపింగ్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ స్టేజి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. దీంట్లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. మరోవైపు గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. లైవ్ అప్డేట్స్
పొట్టి ప్రపంచ కప్లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.