Home » T20 World Cup
కెనడా క్రికెటర్, భారత మూలాలు ఉన్న యువరాజ్ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్-2026లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.
న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) కెనడాతో జరిగిన మ్యాచ్లో తన స్టాన్స్ మార్చుకొని స్విచ్ హిట్తో బంతిని సిక్సర్ తరలించాడు.
ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.
టీ-20 ప్రపంచకప్లో టీమిండియా మరో సునాయాస విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్లోనూ, తర్వాత బౌలింగ్లోనూ మెరిసి పాకిస్థాన్ను చిత్తు చేసింది.
ప్రస్తుతం ఐసీసీని బీసీసీఐ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, కొలంబోలేని పిచ్ను ఏ క్షణంలోనైనా టీమిండియాకు అనుకూలాంగా మార్చవచ్చని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ సంచలన ఆరోపణలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో స్టార్ పేసర్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించాడు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన స్కాట్లాండ్ ఆది నుంచి తడబడుతూ 147 పరుగులకే ఆలౌటైంది.
టోర్నీ ఆరంభానికి ముందే వివాదాలతో నలుగుతున్న రంగం సిద్ధమైంది. నేటి నుంచి మార్చి 8 వరకూ టోర్నమెంట్ జరగనుంది.
రాబోయే టీ-20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పష్టం చేశారు. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో తమ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. పీసీబీ ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరింది.