Home » T20 Cricket
వెస్టిండీస్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్ను కూడా 2-0తో చేజిక్కించుకుంది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా యూఎస్ఏ-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యూఎస్ఏకి 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 15.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా క్రికెట్ టీమ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీ20 వరల్డ్ కప్లో తమ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో తమ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. పీసీబీ ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లా విషయంలో ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు.
స్కాట్లాండ్.. అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుక రిచీ బెరింగ్టన్ నాయకత్వం వహించనున్నాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతోన్న తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ గెలవాలంటే ప్రతీ ఓవర్ కు దాదాపు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితిని భారతజట్టు న్యూజిలాండ్ ముందుంచింది.
టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేశాడు.