Home » Suryapet
వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళితే ఒకరు.. తడుస్తూనే పొలంలోనే విత్తనాలు విత్తుతూ మరొకరు.. పశువులను కాస్తూ మరొకరు ఇలా పిడుగుపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. గురువారం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షాలు పడ్డాయి.
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, పెనుబల్లి, జూన్ 3: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ప్లాట్ రిజిస్ట్రేషన్కు గజానికి రూ.100 చొప్పున మొత్తం రూ.99,200 లంచం తీసుకున్న సూర్యాపేట సబ్-రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు తన 1,240 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు మూణ్నెల్ల క్రితం సబ్-రిజిస్ట్రార్ బానోత్ సురేందర్నాయక్ను కలిశారు.
పౌరసరఫరాల శాఖలో ఇద్దరు జిల్లా అధికారులపై కమిషనర్ డీఎస్ చౌహాన్ కొరడా ఝుళిపించారు. నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎ్సవో) చంద్రప్రకాశ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు (డీఎం) జగదీశ్పై సస్పెన్షన్ వేటువేస్తూ కమిషనర్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
అవి 26 జీవాలు! అందులో 24 ఎద్దులు, రెండు ఆవులున్నాయి! అన్నింటినీ ఒకే కంటెయినర్లో కుక్కేసి సూర్యాపేట నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇదొక్కెత్తయితే.. ఈ తరలింపును అడ్డుకున్న పోలీసులు, ఆ కంటెయినర్ను తెరవకుండా 13 గంటలపాటు అలాగే ఉంచారు. మండే ఎండకు లోపల గాలి ఆడక.. మేత లేక.. తాగేందుకు నీరూ లేక ఆ మూగజీవాలు తట్టుకోలేకపోయాయి.
హైదరాబాద్-విజయవాడ (ఎన్హెచ్-163) జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జూన్ 4న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియగానే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఎన్హెచ్ఏఐ ఓ ఏజెన్సీకి అప్పగించింది.
పాత కక్షలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామ శివారులో ఈ నెల 23న జరిగిన నందికొండ వెంకటేశ్(25) కిడ్నాప్ కేసు విషాదాంతమైంది.
స్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్మిల్లర్స్ అసోయేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.
Telangana: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బీబీ పాటిల్ అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఇది బలపడి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం దక్షిణ ఛత్తీ్సగఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం.. శనివారం దక్షిణ ఛత్తీ్సగఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.