Home » Sunrisers Hyderabad
ఈ సీజన్లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది.
ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లో సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్(IPL 2024) ఈసారి 17వ సీజన్ లీగ్ జరుగుతోంది. నేటి ఫైనల్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్(KKR), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన, ఓడిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి సమరానికి వేళయ్యింది. ఈ ఫైనల్ మ్యాచ్లో టైటిల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. రేపు (మే 26న) సన్రైజర్స్ హైదరాబాద్(SRH), కోల్కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై(chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి మళ్లీ చరిత్రను పునరావృతం చేసే మంచి ఛాన్స్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 చివరకు దశకు వచ్చేసింది. ఈ సీజన్లో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్(KKR), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు రేపు (మే 26) తలపడనున్నాయి. అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందా, ఉంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇన్సింగ్స్ అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. కానీ తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్కు చిక్కారు. శర్మతో ఎస్ఆర్హెచ్ వికెట్ల పతనం మొదలైంది. తర్వాత 5 ఓవర్లో రాహుల్ త్రిపాఠిని కూడా బౌల్ట్ వెనక్కి పంపించాడు. అదే ఓవర్లో మార్కమ్ను ఔట్ చేశాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు తీశాడు.
ఐపీఎల్-2024లో ఫైనల్ చేరనున్న మరో జట్టు ఏది?... ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రానుంది. ఫైనల్లో చోటే లక్ష్యంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ షురూ అయ్యింది.
ఆదివారం చెన్నైలో జరిగే ఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్లో కోల్కతాను ఢీకొట్టే జట్టేది? ఆ సస్పెన్స్కు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం జరగబోయే క్వాలిఫయర్-2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబద్ జట్లు తలపడబోతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడితే ఫైనల్స్కు ఏ జట్టు చేరుతుందో ఇప్పుడు చుద్దాం.