Home » Summer
శివారు ప్రాంతాల్లో ఉదయం పొగ మంచు కురుస్తుంటే, మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు ముందస్తుగానే ముదురుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి తాపం మొదలైంది.
తెలంగాణలో వేసవి కాలం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల ముగియక ముందే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్ డిమాండ్ మొదలైందని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ పూర్తిగా మందగించాయి. ఎండాకాలం తరహాలో వేడిగాలులు, ఉక్కపోతతోపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికితోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల వేడి, ఉక్కపోత కొనసాగాయి.
రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలతో ఎండ తీవ్రత కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు మరియు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
మామిడిపండ్లంటే ఇష్టపడని వారుండరు. అయితే.. ఈ పండ్లను కార్బైడ్తో మాగబెడుతూ విషతుల్యం చేస్తున్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల దగ్గర తక్కువ ధరకు తెస్తున్న వ్యాపారులు వాటిని గోదాముల్లో కార్బైడ్తో మాగబెడుతున్నారు. వీటిని తినడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.