Home » Strike
అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే... సభలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా ఉందని, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతున్నట్లుగా లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎ్సఎఫ్ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని.. డిసెంబరులో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్లోని అశోక్నగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోలిగడ్డకు చెందిన రాజ్అరుణ్ అనే యువకుడికి కడుపు, చేతిపై కత్తిపోట్లు పడ్డాయి. అతని వర్గీయులు వెళ్లి రాంనగర్లో కొందరిని పట్టుకోగా అక్కడా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.
వనదేవతల గద్దెల వద్ద పూజారులు ధర్నా చేశారు. వరంగల్లోని ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మల పేరు పెట్టాలని, రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ఆదాయం నుంచి మూడో వంతు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడారం దేవస్థానం ప్రధాన గేటు ఎదుట అర్చక సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ప్రధాన పూజారి కొక్కెర రమేశ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు.
బల్దియా కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జీహెచ్ఎంసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ పోరుకు దిగారు. ఇప్పటికే ఇచ్చిన డెడ్లైన్ (ఈనెల 18)లోగా బకాయిలు చెల్లించాలని కొన్ని నెలల క్రితం జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో నిర్వహణ పనులను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
అమరావతి: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణలతో అంగన్వాడీ నాయకత్వం సమావేశం కానుంది.
అమరావతి: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓ వైపు అంగన్ వాడీలు, మరోవైపు పారిశుద్ద్య కార్మికుల సమ్మెలతో ఏపీ అట్టడికిపోతోంది. కనీస వేతనం కోసం మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో...