Home » Srisailam
కొద్దిరోజులుగా భారీగా వస్తున్న వరదతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇంకా నిలకడగా వరద వచ్చిచేరుతుండటంతో ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి ఉంచారు.
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు. జులై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం వచ్చి చేరింది.
నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 2,63,532 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,67,556 క్యూసెక్కులు మొత్తం 4,33,088 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఆల్మట్టి దాకా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతోంది. ప్రధానంగా శ్రీశైలాన్ని నింపి.. నాగార్జునసాగర్ దిశగా కదులుతున్న కృష్ణవేణి ఆ ప్రాజెక్టును కళకళలాడిస్తోంది. వరద క్రస్ట్ గేట్లను తాకింది.
కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి.. పది గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ కూడా జలసిరితో కళకళలాడుతోంది. వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక శాతం కేటాయించిందని తెలిపారు.
శ్రీశైలాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) గురువారం రోజున శ్రీశైలం(Srisailam)లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్, బాంబుస్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా పరిశీలించారు.