Home » Srisailam
నంద్యాల జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు కలిసి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి తరలివచ్చారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోలు తగ్గినందున.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీ సర్కారును తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది.
పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీప్లేన్ సర్వీ్సకు శుక్రవారం నిర్వహించిన సెమీ ట్రయల్ రన్ విజయవంతమైంది.
శ్రీశైలం శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
మెప్మా విభాగంలోని ఐక్య సంఘాలను పక్షాళన చేసి తీరుతామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
శ్రీశైలంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం శ్రీశైలానికి చెందిన పి.ప్రభావతి అనే భక్తురాలు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసూదన్రెడ్డికి అందజేశారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే వాడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది.
భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీకమాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో జిల్లాలో ప్రముఖ శివాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శనివారం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్కు చెందిన వంశీ వికాస్ అనే భక్తుడు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసుదన్ రెడ్డికి అంద జేశారు.
శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. ఆర్టిసీ బస్టాండ్ సమీపంలోని ప్రహరీ గోడపై చిరుత కూర్చొని ఉండాన్ని స్థానికులు, భక్తులు గుర్తించి.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో భక్తులతోపాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.