Home » SRH
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదిక కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం మ్యాచ్లో భాగంగా ఇవాళ(శనివారం) చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకుండానే ఈ కొత్త సీజన్ను ఎస్ఆర్హెచ్ ప్రారంభించనుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి ఇషాన్ కిషన్ను యువ ప్లేయర్ జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ తర్వాత పెవిలియన్ వైపు చూపిస్తూ ‘నీవు ఔట్.. వెళ్లిపో’ అంటూ సీరియస్గా ప్రవర్తించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ క్రమంలో జరిగిన ఇంట్రా స్క్వాట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్లు ఆడి.. ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపారు.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ లియామ్ లివింగ్స్టోన్ను జట్టు నుంచి అనూహ్యంగా తప్పించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్నకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో లివింగ్స్టోన్ ఇంగ్లండ్ మేనేజ్మెంట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ది హండ్రెడ్ లీగ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్.. పాక్ క్రికెటర్ను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇంగ్లండ్ జట్టును తాజాగా ప్రకటించారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో లివింగ్స్టోన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 13కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో 15 మందిని మాత్రమే రిటైన్ చేసుకుంది. దీంతో పది ఖాళీలు ఏర్పడ్డాయి. పర్సులో కేవలం రూ.25కోట్లే ఉన్నాయి. దీంతో వేలంలో కావ్య మారన్ ఏం చేయనుందోనని ఆసక్తిగా మారింది.
HCA SRH Dispute: నకిలీ పత్రాలతోనే జగన్ మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారు.