Home » Sonia Gandhi
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై బీహార్ ముజఫర్పూర్ జిల్లాలోని ఓ కోర్టులో శనివారం ఫిర్యాదు దాఖలైంది. దేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచినందుకు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్పూర్కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా ఫిర్యాదు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖల పట్ల కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఢిల్లీలోని ద్వారకలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని అన్నారు.
దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Sonia Gandhi: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు స్పందించారు.
గాంధీ కుటుంబంపై దేశ ప్రజలకు తెలియకూడనివి ఈ లేఖల్లో ఏముందని బీజేపీ ప్రశ్నించింది. 2008లో ఈ మ్యూజియం నుంచి 51 పెట్టెలను తరలించారని సోనియా గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నెహ్రూ లేఖలు సైతం ఉన్నాయని బీజేపీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోనియా, రాహుల్ ఫొటోలతో కటౌట్లు ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్ సోరోస్’ అస్త్రం దొరికింది.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు.