Home » Sonia Gandhi
‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు. తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు, బలిదానాలతో భారతాన అవతరించిన తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని చాటుకుంటూ.. అగ్రపథాన పయనిస్తూ.. దశాబ్ద కాలాన్ని దాటుతోంది. ఆత్మగౌరవ పోరాటం ఫలించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం మంచిదని.. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయం తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.
ఏటా పచ్చదనం పెంపునకు అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం. వర్షా కాలం ప్రారంభం తోటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు మరింత ప్రత్యేకం! జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు నిండుతాయి! పదేళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్లో జరిగే జరుగుతాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.