Home » Sonia Gandhi
ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.
రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి, రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ‘కట్-ఆ్ఫ-డేట్’గా నిర్ణయించింది.
ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు.
ఈసారి లోక్సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్’లో ఉంచింది.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సోమవారం ఢిల్లీలో కలిశారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ ఏడాది డిసెంబరు 9న సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తెలంగాణ తల్లి ఉత్సవం’ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు 'ఇండియా' కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి బోటా బోటి మెజార్టీతో అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం 240 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతోంది. గత ఎన్నికలతో పోల్చితే సీట్ల సంఖ్య పెరిగింది.