Home » Social Media
తప్పయిపోయింది. తనను క్షమించాలంటూ వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు, సినీ నటి శ్రీరెడ్డి వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేస్తూ ఓలేఖను సామాజిక మధ్యమం ఎక్స్లో శ్రీరెడ్డి పోస్టు చేశారు. జగన్ హయాంలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కూటమి ప్రభుత్వంలో కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతిపరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లికి.. చెల్లికి తేడా లేకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ " సామాజిక కార్యకర్తలనటం" సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పోస్టుల అంశం కాకరేపుతోంది. సోషల్ పోస్టుల అంశంపై వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ నేతలు స్పందించారు. దొంగే దొంగ అన్నట్టు ఉంది అని విరుచుకుపడ్డారు. వారే పోస్టులు చేసి, నెపం తమపై నెడుతున్నారని మండిపడ్డారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.
లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు.
సోషల్ మీడియాలో అత్యంత హేయమైన భాషను ఉపయోగించి పోస్టులు చేసిన ఎంపీ అవినాశ్రెడ్డి అనుచరుడు, జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రా రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, ఇతర మంత్రులు సహా వారి కుటుంబాల్లోని మహిళలపై బండ బూతులతో విరుచుకుపడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.