Home » Social Media
వైఎస్ జగన్ వీరాభిమాని, ఆ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిడుతూ.. తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనను నమ్మి మోసపోయానని, వ్యాపారంలో నష్టపోయి రోడ్డు పాలయ్యానని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్ను బయట ఉంచి తప్పు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్త అన్నారు.
‘దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర.. కేసీఆర్ తెలంగాణ లో సాధించిన నీలి విప్లవం’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గుకు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనమని అన్నారు. తెలంగాణ చేపల పెంపకంలో ఉత్తమ ‘ఇన్ ల్యాండ్ స్టేట్’ గా అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయమని వ్యా్ఖ్యానించారు.
ప్రపంచ స్థాయి ఐటి పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాత్రి GCCలు, HTD భాగస్వాములు CXOలతో సీఎం భేటీ అయ్యారు. ఫలవంతమైన చర్చ జరిగిందని సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేశారు.
సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది.
ప్రజల్లో బలం కోల్పోవడంతో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారానికి తెరలేపారనే ఒక చర్చ జరుగుతోంది. నాలుగు నెలల పాటు కూటమి ప్రభుత్వం జస్ట్ వార్నింగ్లతో సరిపెట్టి సైలెంట్గా ఉన్నప్పటికీ ఫేక్ ప్రచారాలు తగ్గకపోవడంతో చర్యలు ..
ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న వారిపై చర్యలకు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కొణతం దిలీప్ను సోమవారం హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా సినీ నటి, వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తాజాగా గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రీల్స్ పేరుతో రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, ప్రయాణికులకు అసౌకర్యం కల్పించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రైల్వేబోర్డ్ నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
శాసన మండలిలో సోషల్ మీడియా పోస్టులపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.