Home » Social Media
ఒక కార్టూన్ వీడియోలో చేసిన అంచనా ఆధారంగా జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తేదీ దగ్గరకు రావడంతో అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే అది నిజమేనా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘అక్కరకు రాని చుట్టము.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా.. నెక్కినఁ బారని గుర్రము.. గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ.. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్’.. అంటూ విమర్శలు చేశారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కేసుల్లో పులివెందుల పోలీసులు మరింత దూకుడు పెంచారు. వర్రా రవీందర్ రెడ్డి విచారణలో ఇచ్చిన వాంగ్మూలం మేరకు గుంటూరుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పులివెందులకు తరలించారు. వర్ర రవీంద్రరెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.
CM Chandrababu: శ్రీహరి కోట, ఇస్రో నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వి-సి 60 రాకెట్ విజయవంతంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది మానవ సహిత అంతరిక్ష యానానికి, ఉపగ్రహాల మెయింటినెన్స్కు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు.
Andhrapradesh: వైసీపీ సోషల్ మీడియా కేసుల్లో వర్రా రవీందర్ రెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ప్రశ్నించింది. ఇదే కేసులో మరో 55 మందిని పులివెందుల పోలీసులు ప్రశ్నించనున్నారు. నిందితులకి 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నేడు అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు.
రాష్ట్రంలో గత సర్కారు కొనసాగించిన మానసిక, భౌతికదాడులకు చరమగీతం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చెయ్యి వేయడానికి భయపడే పరిస్థితిని తీసుకురావాలని భావిస్తోంది.
Year Enders 2024: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ సైకోల భరతం పట్టింది.
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని, గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు.
మీరు ఏదైనా ఈవెంట్ లేదా కచేరి కార్యక్రమానికి వెళ్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ధరల దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది. తాజాగా చోటుచేసుకున్న అలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.