Home » SIT Special Investigation Team
ధనుంజయ్ రెడ్డి సంబంధిత మహిళ దుబాయ్ నుంచి బంగారం తరలించిన విషయాన్ని కూడా సిట్ దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మద్యం స్కాం వెనుక అసలైన సూత్రధారిని బయటకు తేయాలని టీడీపీ ఒత్తిడి తెస్తోంది.
జగన్మోహన్ రెడ్డి మీద సిట్ విచారణ పెరుగుతోందని, ఆయనపై లిక్కర్ స్కాంలు, మైనింగ్ దోపిడీ, రేషన్ బియ్యం దొంగతనం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ అవినీతులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
లిక్కర్ స్కామ్లో కీలక నాయకులు అరెస్ట్ అయినా, తెర వెనకున్న అసలు సూత్రధారి ఇంకా బయటపడలేదు. సిట్ ఆధునిక టెక్నాలజీతో విచారణ జరుపుతోంది.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులోభాగంగా గురువారం లడ్డూ తయారీ కేంద్రమైన పోటులో సిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.
రాష్ట్రంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందించనున్నారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి ప్రాథమిక నివేదిక అందనుంది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది. రెండు రోజులపాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి.