Home » Singanamala
మండలంలోని శివపురం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నారు. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేదుకు ఎనిమిది నెలలు కిందట ఆర్డీటీ వారు బోరు వేసి, మోటారు ఏర్పాటు చేశారు. కానీ పంచాయతీ అధికారులు మోటారుకు విద్యుత కనెక్షన ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.
వలస కూలీల నివారణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా నార్పల మండలం బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే అధికారులు ఉపాధి పనులు కల్పించకపోవడంతో, పనుల కోసం కూలీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ మండలంలోనే నెలకొంది. నార్పల మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి 12వేల జాబ్కార్డులు ఉన్నాయి.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మం డల పరిధిలోని నీలారెడ్డిపల్లిలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకు లను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళలర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు.
మండలంలోని కల్లూరు సమీపంలోని తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఓ లారీ దగ్ధమయ్యింది. పోలీసులు తెలిపిన మేరకు రాజస్థాన రాష్ట్రంలోని మైరైనా జిల్లాకు చెందిన డ్రైవర్ గాంధార్ సింగ్, క్లీనర్ రామ్ధీర్ ఇద్దరు ఈనెల 20న గోధుమల లోడుతో బెంగళూరుకు బయల్దేరారు.
‘జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అనంతపురం - తాడిప్రతి చేపట్టిన పనులకు ఎర్రమట్టి కోసం నా పొలాన్ని తవ్వారు. మళ్లీ చదును చేయకుండా అలాగే వదిలేశారు. అడిగితే బెదిరిస్తున్నారు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలి.’ అని చంద్రశేఖర్ అనే దివ్యాంగుడైన దళిత రైతు వేడుకుంటున్నాడు.
మండల పరిధిలోని సి.బండమీదపల్లి బీసీ కాలనీ వాసులు తాగునీటిని డ్రిప్పు వైరు ద్వారా పట్టు కోవాల్సి వస్తోంది. గ్రామంలో జరిగిన జాతీయ రహదారి పనుల సమయంలో బీసీ కాలనీ చెందిన తాగునీటి పైపులైన్లు చాలా మటుకు ధ్వంసం అయ్యాయి. దీంతో వారు ఊరు చివర కొంత బాగున్న పైపు లైనకు డ్రిప్పు వైరు తగిలించుకుని తాగునీటిని పట్టుకుంటున్నారు.
సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. మండల పరిధిలోని జంతులూరులో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 220 కేవీ విద్యుత సబ్స్టేషనను ఎమ్మెల్యే శనివారం ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.
నియోజకవర్గంలోని ఎస్సీల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి విన్నవించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు.
నియోజకవర్గంలోని పురాత నమైన దేవాలయాల అభి వృద్ధితో పాటు గూగూడు ను పుణ్యక్షేత్రంగా, పర్యా ట క ప్రాంతంగా అభివృద్ధి చే యడానికి నిధులు కేటా యించాలని రాష్ట్ర దేవదా య శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డికి ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మం త్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత శ్మశాన వాటిక ప్రహరీ, భవనం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శింగనమల ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు వైసీపీ ప్రభుత్వంలో చుట్టూ ప్రహరీ, భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ. 12 లక్షలు, ఏఆర్జీసీ నిధులు రూ. 7 లక్షలు చొప్పున మొత్తం రూ. 19 లక్షలు కేటాయించారు. వీటితో అక్కడ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు.