Home » Singanamala
ఎస్సీ ఉపవర్గీకరణకు కేబి నెట్ అమోదం తెలుపడం సామాజిక న్యాయానికి చారిత్రాత్మక విజ యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఆమె గురువారం అనంతపురం లోని క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఉపవర్గీకరణకు కే బినేట్ అమోదంపై ఎస్సీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వ హించి, ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
శింగనమల నియోజకవర్గ రైతుల పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అసలే వేసవికాలం. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో మండలంలోని కుంటలు, చెరువుల్లో నీరు లేదు. మూగజీవాల దాహం తీర్చే నీటి తొట్టెలు కనబడడంలేదు. దీంతో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు గొర్రెల కాపర్లు, రైతుల తిప్పలు వర్ణనా తీతం. వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజక వర్గంలోని గురుకుల, మోడల్ పాఠశాలలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు. ఎమ్మెల్యే మంగళవారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన విద్యా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉట్లపరుష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం ఉట్ల పరుష కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
మండలంలోని శివపురం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నారు. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేదుకు ఎనిమిది నెలలు కిందట ఆర్డీటీ వారు బోరు వేసి, మోటారు ఏర్పాటు చేశారు. కానీ పంచాయతీ అధికారులు మోటారుకు విద్యుత కనెక్షన ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.
వలస కూలీల నివారణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా నార్పల మండలం బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే అధికారులు ఉపాధి పనులు కల్పించకపోవడంతో, పనుల కోసం కూలీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ మండలంలోనే నెలకొంది. నార్పల మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి 12వేల జాబ్కార్డులు ఉన్నాయి.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మం డల పరిధిలోని నీలారెడ్డిపల్లిలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకు లను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళలర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు.
మండలంలోని కల్లూరు సమీపంలోని తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఓ లారీ దగ్ధమయ్యింది. పోలీసులు తెలిపిన మేరకు రాజస్థాన రాష్ట్రంలోని మైరైనా జిల్లాకు చెందిన డ్రైవర్ గాంధార్ సింగ్, క్లీనర్ రామ్ధీర్ ఇద్దరు ఈనెల 20న గోధుమల లోడుతో బెంగళూరుకు బయల్దేరారు.
‘జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అనంతపురం - తాడిప్రతి చేపట్టిన పనులకు ఎర్రమట్టి కోసం నా పొలాన్ని తవ్వారు. మళ్లీ చదును చేయకుండా అలాగే వదిలేశారు. అడిగితే బెదిరిస్తున్నారు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలి.’ అని చంద్రశేఖర్ అనే దివ్యాంగుడైన దళిత రైతు వేడుకుంటున్నాడు.