Home » Siddipet
వారం రోజుల్లో రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు.
నాటు బాంబు పేలి(Bomb Explosion) ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన హుస్నాబాద్ మండలం మీర్జాపూర్(Mirzapur)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు కలీం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనుల చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.
తల్లి చనిపోయిన బాధలో ఉంటే.. కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) 161 ప్రకారం నేరాంగీకార పత్రం(కన్ఫెషన్) ఆధారంగా చార్జ్షీట్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న సిద్దిపేట స్టీల్ బ్యాంకు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
Telangana: నాలుగు రోజుల క్రితం కొండపాక మండలం దమ్మక్క పల్లి గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు బండి కిష్టయ్యను.. మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. భూ తగాదాల విషయంలో గడ్డి మందు సేవించి బలవన్మరణానికి యత్నించడంతో బండి కిష్టయ్యను వెంటనే ములుగు మండలంలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ రాకుంటే సిద్దిపేట ఇంత అభివృద్ధి జరిగేది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో ఈరోజు (ఆదివారం) మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీశ్రావు ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్లో చేర్చుకోవడం దారుణమంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.