Home » Siddaramaiah
కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్..
మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.
ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం ఆగస్ట్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు.. అంటే వారం రోజుల పాటు పాదయాత్ర చేయాలని ఈ రెండు పార్టీలు.. నిర్ణయించాయి.
'వాల్మీకి కుంభకోణం'లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడిక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన వాల్మీకి కమ్యూనిటీ సొమ్ములను దారి మళ్లించడమేనా మీరు చెప్పే న్యాయం? అని నిలదీశారు.
కర్ణాటక కోటా బిల్లు తీవ్ర దుమారం రేపతోంది. ప్రైవేట్ కంపెనీలు, ఇండస్ట్రీస్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించింది. ఆ బిల్లుపై ఇంటా బయటా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెంగళూర్లో ఉండే స్థానికేతరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ పే కో ఫౌండర్ సమీర్ నిగమ్ స్పందించారు.
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెంటనే ఆ పోస్ట్ను సీఎం తొలగించారు.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిలో సీఎం సిద్దరామయ్య కుటుంబ భాగస్వామ్యం, వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ గ్రాంట్లు బినామీ ఖాతాలకు ....
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ(ముడా) కుంభకోణం కలకలం రేపుతోంది. ఇందులో సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం.....
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కన్నుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి ఈ స్కామ్ ద్వారా భారీ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరెంత కాలం ప్రాణం ఉంటుందోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) ఎద్దేవా చేశారు. ప్యాలెస్ మైదానంలో బీజేపీ రాష్ట్ర ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాపాలలో మునిగిపోయిందని విమర్శించారు.