Home » Siddaramaiah
లొంగిపోయిన నక్సలైట్లకు వివిధ నేరాలతో ప్రమేయముందని, వీరి తలపై రివార్డును కూడా ఉందని అధికారులు తెలిపారు. నక్సలైట్లు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సిద్ధరామయ్య వారం రోజుల క్రితం పిలుపునిచ్చారు.
విపక్షాలంటే కేవలం ఆరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేయాలని కర్ణాటక ముఖ్మమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి కుమారస్వామిని నిలదీశారు.
మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికైన బోర్డు కాదని, అధికారులను రాష్ట్ర ప్రభుత్వమే నియమించిందని జేడీఎస్ తెలిపింది. ఇందుకు ప్రతిగానే మైసూరు సిటీ రోడ్డుకు సిద్ధారమయ్య పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది.
స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది.
ముడా కేసు విచారణలో భాగంగా సిద్ధరామయ్య భార్య పార్వతిని గత అక్టోబర్ 25న లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్ను పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఓటరు... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. పార్టీ మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసింది.
మైసూర్ అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ కుంభకోణంలో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు చేపట్టారు.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సీఎం సిద్ధరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దసరా తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని అన్నారు. మరోవైపు కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సెప్టెంబర్ 31న పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. తన భార్యకు 14 స్థలాలను 'ముడా' కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు.