Home » Siddaramaiah
బీఎం పార్వతి నుంచి డవలప్మెంట్ కోసం ముడా స్వాధీనం చేసుకున్న భూములకు కొన్ని రెట్లు విలువైన భూములను ఆమె పొందారన్నది ఈ కేసులో ఉన్న ప్రధాన అభియోగం. ఖరీదైన భూములకు తన భార్యకు దక్కేలా సిద్ధరామయ్య చేశారంటూ సమాచార హ్కకు చట్టం కింద టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు.
లోకాయుక్త ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున లోకాయుక్త పోలీసులు సమర్ధవంతంగా విచారణ జరపలేరని పిటిషనర్ వాదించారు. లోకాయుక్త, సీబీఐ, మరే ఇతర దర్యాప్తు సంస్థతోనైనా దీనిపై దర్యాప్తు జరిపించాలని పిటిషన్ కోరారు.
సిద్ధరామయ్య ఎడమ మోకాలికి గతంలో శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడది తిరగబెట్టిందని, దీంతో సీఎం నివాసంలో వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది.
రెసిడెన్సియల్ లేఔట్స్ కింద మైసూరు అర్బన్ డవలప్మెంట్ అధారిటీ సీఎం సతీమణి నుంచి భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించింది. ఆమె నుంచి సేకరించిన భూముల విలువ కంటే అత్యధిక విలువ కలిగిన భూములను ఆమెకు కేటాయించారనేది ప్రధాన వివాదం.
Chief Minister Siddaramaiah: తమ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కేటాయింపుల్లో మోదీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. దేశ జీడీపీలో కర్ణాటక కీలకంగా వ్యవహరిస్తోన్న.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రం తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం మార్పు జరుగనుందంటూ వస్తున్న ఊహాగానాలపై సూర్జేవాలా సైతం స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ఉందని, సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ తీసుకుంటారని చెప్పారు.
లొంగిపోయిన నక్సలైట్లకు వివిధ నేరాలతో ప్రమేయముందని, వీరి తలపై రివార్డును కూడా ఉందని అధికారులు తెలిపారు. నక్సలైట్లు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సిద్ధరామయ్య వారం రోజుల క్రితం పిలుపునిచ్చారు.
విపక్షాలంటే కేవలం ఆరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేయాలని కర్ణాటక ముఖ్మమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి కుమారస్వామిని నిలదీశారు.
మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికైన బోర్డు కాదని, అధికారులను రాష్ట్ర ప్రభుత్వమే నియమించిందని జేడీఎస్ తెలిపింది. ఇందుకు ప్రతిగానే మైసూరు సిటీ రోడ్డుకు సిద్ధారమయ్య పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది.
స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది.