• Home » Shiv Sena

Shiv Sena

Monsoon Session eve: ప్రభుత్వ టీపార్టీని బహిష్కరించిన విపక్షాలు

Monsoon Session eve: ప్రభుత్వ టీపార్టీని బహిష్కరించిన విపక్షాలు

మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ నేతలు బహిష్కరించారు. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

NCP : శరద్ పవార్‌తో అజిత్ పవార్ వర్గం భేటీ

NCP : శరద్ పవార్‌తో అజిత్ పవార్ వర్గం భేటీ

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

మహారాష్ట్ర శాసన సభ సభాపతికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసును జారీ చేసింది.

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం వినూత్న వ్యాఖ్యలు

Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం వినూత్న వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించినపుడు, మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెడుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్‌సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

Maharashtra : మహారాష్ట్ర పరిణామాల వెనుక శరద్ పవార్ హస్తం : రాజ్ థాకరే

Maharashtra : మహారాష్ట్ర పరిణామాల వెనుక శరద్ పవార్ హస్తం : రాజ్ థాకరే

మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో

Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో

మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శి హెచ్‌కే పాటిల్ ఈ సమావేశానికి హాజరవుతారు. శాసన సభలో ప్రతిపక్ష నేత పదవిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఈ పదవికి శుక్రవారం రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి