Home » Shashi Tharoor
జాతీయ భద్రతపై శశిథరూర్ గత శనివారంనాడు చేసిన వ్యాఖ్యలు ఆయనకూ, మురళీధరన్కూ మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. కొచ్చిలో ఓ హైస్కూలు విద్యార్థి అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ, మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సరైనదేనని తాను నమ్మడం వల్ల అనేక మంది తనను విమర్శించారని, అయితే తన వైఖరి సరైనదేనని నమ్మి దానిపై నిలబడ్డానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా వెళ్తున్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్పై కేపీసీసీ మాజీ అధ్యక్షుడు ..
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం క్రమేణా బహిర్గతమవుతోంది.
కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి.. అప్పటి చర్యల్ని బహిర్గతం చేశారు.
ఎగిరేందుకు అనుమతి కోరకు. రెక్కలు నీవి. ఆకాశం ఎవరిదీ కాదు అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎక్స్లో వ్యాఖ్యలు చేశారు.
శశిథరూర్ తాజాగా ఒక వ్యాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం కాంగ్రెస్ను ఇరకాటంలో పడేసింది. ప్రధాని ఇటీవల కేరళలో జరిపిన పర్యటనలో కూడా ఆయన వెంట శశిథరూర్ ఉన్నారు.
ఇతర దేశాలతో సంబంధాలను బలపరుచుకోవడంలో మోదీ శక్తి, చైతన్యం ప్రదర్శించారని తాను చెప్పానని, ఇది ఎంత మాత్రం బీజేపీ విదేశాంగ విధానమో, కాంగ్రెస్ విదేశాంగ విధానం గురించో కాదని శశిథరూర్ అన్నారు.
అసలే తనపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరింత ఆగ్రహం కలిగించే వ్యాఖ్యలను ఎంపీ శశిథరూర్ చేశారు. ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆయన మరింత ఇరుకునపెట్టారు.
పాకిస్థాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ.. ‘నరేందర్..
యూఎన్ ఆంక్షల కమిటీకి టీఆర్ఎఫ్కు సంబంధించిన సాక్ష్యాలను పలుమార్లు సమర్పించామని, ప్రతి సందర్భంలోనూ తన మిత్రదేశం పాకిస్థాన్కు అండగా నిలుస్తూ టీఆర్ఎఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని శశిథరూర్ వివరించారు.