Home » Sharad Pawar
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. చరిత్రలో నిలిచిపోయేలా, ప్రపంచ దేశాలన్నీ భారత్ జపం చేసేలా.. ఈ సదస్సుని కేంద్రం గ్రాండ్గా...
ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరుగుతున్న ఈ సమావేశాల తొలి రోజు 28 పార్టీలకు చెందిన 63 మంది హాజరయ్యారు.
విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల కీలక సమావేశం ముంబైలో ఈనెల 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ థాకరే ఘాటు విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారని, అయితే తాము అభివృద్ధితో పాటు స్వేచ్ఛ కూడా కోరుకుంటున్నామని పరోక్షంగా మోదీ పాలనపై చురకలు వేశారు.
మరాఠా రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మాటల్లో అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆయన ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో తెలియడం లేదు. తన సమీప బంధువు అజిత్ పవార్ పార్టీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ, తన పార్టీలో చీలిక లేదని చెప్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్పవార్(Sharad Pawar) తన బంధువు, ఎన్సీపీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar)తో రహస్యంగా భేటీ అయినట్టు, కేంద్ర మంత్రివర్గం(Union Cabinet) లో చేరేలా అజిత్ ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు వచ్చిన వార్తలతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కేంద్రంలోని ఎన్డీయే కూటమికి దగ్గరవుతున్నారని, ఆయన కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి, పవార్కు కేంద్రంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాల నేపథ్యంలో పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనాన్ని ఎండగట్టారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి ఎన్సీపీ జారిపోబోతోందా?
భారతీయ జనతా పార్టీతో పొత్తు ) విషయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టత ఇచ్చారు. కొంతమంది శ్రేయాభిలాషులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తు్న్నారని, అయితే బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేది లేదని తెలిపారు.
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్ ను ఆయన మేనల్లుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారంనాడు కలుసుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత జూలై 2న ఎన్సీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ అదేరోజు ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.