Home » Sharad Pawar
మరాఠా రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మాటల్లో అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆయన ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో తెలియడం లేదు. తన సమీప బంధువు అజిత్ పవార్ పార్టీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ, తన పార్టీలో చీలిక లేదని చెప్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్పవార్(Sharad Pawar) తన బంధువు, ఎన్సీపీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar)తో రహస్యంగా భేటీ అయినట్టు, కేంద్ర మంత్రివర్గం(Union Cabinet) లో చేరేలా అజిత్ ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు వచ్చిన వార్తలతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కేంద్రంలోని ఎన్డీయే కూటమికి దగ్గరవుతున్నారని, ఆయన కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి, పవార్కు కేంద్రంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాల నేపథ్యంలో పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనాన్ని ఎండగట్టారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతోందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి ఎన్సీపీ జారిపోబోతోందా?
భారతీయ జనతా పార్టీతో పొత్తు ) విషయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టత ఇచ్చారు. కొంతమంది శ్రేయాభిలాషులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తు్న్నారని, అయితే బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేది లేదని తెలిపారు.
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్ ను ఆయన మేనల్లుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారంనాడు కలుసుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత జూలై 2న ఎన్సీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ అదేరోజు ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి తిరుగుబాటు తప్పకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఎన్సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారంనాడు ఒకే వేదకను పంచుకున్నారు. ప్రధాని వేదికపైకి వస్తూనే అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు.