Home » Sharad Pawar
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్థాకరేలు సీఎం ఏక్నాథ్ షిండేను శనివారంనాడు వేర్వేరుగా కలుసుకున్నారు.
మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే అన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, ఎన్సీపీ(ఎస్పీ) నేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ల మధ్య రాజకీయం వేడెక్కింది. ఇటీవల మహారాష్ట్రలోని పుణెలో జరిగిన బీజేపీ సదస్సులో శరద్ పవార్ను ఉద్దేశించి ‘అవినీతి చక్రవర్తి’ అని షా వ్యాఖ్యానించారు.
''అవినీతికి సూత్రధారి'' అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి సుప్రీంకోర్టు ఆయనను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్లో వారిద్దరూ సమావేశమయ్యారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పై కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని శరద్ పవార్ పార్టీ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. పుణెలో మహారాష్ట్ర బీజేపీ సెషన్లో అమిత్షా ఆదివారంనాడు మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకుడు ఖర్గేని మాట్లాడాలనివ్వాలని విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం, చివరకు వారు సభ నుంచి వాకౌట్ చేయడంపై ఎన్సీపీ-ఎస్సీపీ చీప్ శరద్ పవార్ (Sharad Pawar)స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఆయనను ప్రధానమంత్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందని సీనియర్ నాయకుడు, ఎన్ఎ్సపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ వెల్లడించారు.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి'కి మద్దతు తెలిపిన ప్రజలందరికీ కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీఏ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, పృధ్వీరాజ్ కపూర్ సంయుక్తంగా శనివారంనాడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడైతే రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించారో అక్కడ తాము గెలిచామని ఈ సందర్భంగా శరద్ పవార్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య(Ayodhya)ఉన్న ఫైజాబాద్లో బీజేపీ ఓటమిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చూసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad Pawar) విమర్శించారు.