Home » Shaktikanta Das
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) ద్రవ్య విధాన ఫలితాలను శుక్రవారం ప్రకటించిన క్రమంలో UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) గురించి కీలక ప్రకటన చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు UPI చెల్లింపులు మరింత ఈజీగా మారనున్నాయని చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ వరుసగా ఏడవసారి రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రేటు స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ బాంబు బెదరింపు ఒకటి మంగళవారంనాడు తీవ్ర కలకలం రేపింది. ఆర్బీఐ, మరో రెండు ప్రైవేటు బ్యాంకులను పేల్చివేస్తామని ఈ-మెయిల్ సెండర్ బెదిరించాడు. తాము 'ఖిలాఫత్ ఇండియా'కు చెందినట్టు అతను క్లెయిమ్ చేసుకున్నాడు.
కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కీలకమైన రెపో రేటు 6.50 శాతంగా మార్పుల్లేకుండా కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీసీలో (Monetary Policy Committee) నిర్ణయించామని, కమిటీలోని ఆరుగురు సభ్యులు ఇందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు.
ఉన్నపళంగా రూ.2 వేల నోటు ఉపసంహరించడం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏమైనా ప్రభావం చూపుతుందా?.. అనే ప్రశ్నకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) సమాధానమిచ్చారు. పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయం ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే మూడింట రెండొంతుల రూ.2000 నోట్లు వ్యవస్థలోకి వచ్చిచేరాయని తెలిపారు.