Home » Sensex
ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది. ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ భారీ నష్టాలను నమోదు చేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) ఐపీఓల(ipos) వారం రానే వచ్చింది. ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమయ్యే వారంలో 3 కొత్త IPOలు రాబోతున్నాయి. వీటిలో 2 మెయిన్బోర్డ్ సెగ్మెంట్ నుంచి 1 SME సెగ్మెంట్ నుంచి వస్తుంది. ఇవి కాకుండా గత వారంలో ఇప్పటికే ప్రారంభించిన ఐదు IPOలలో కూడా డబ్బును పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది.
మళ్లీ స్టాక్ మార్కెట్(stock market) కొత్త వారం రానే వచ్చింది. అయితే వచ్చే వారం(August 5th 2024) స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపనున్న ప్రధాన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటు నిర్ణయం, స్థూల ఆర్థిక సూచీలు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ల ఆధారంగా రానున్న వారం మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డు సృష్టించగా, నేడు(శుక్రవారం) మాత్రం భారీగా పతనమైంది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.50 గంటల నాటికి సెన్సెక్స్ 890 పాయింట్ల నష్టపోయి 80,977 పరిధిలో ఉండగా, నిఫ్టీ 50 సూచీ 288 పాయింట్లు కోల్పోయి 24,722 స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 3 సంవత్సరాల పాటు భారతీయ సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధించింది. దీంతో మాల్యా 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) నేడు శుక్రవారం (జులై 27న) వారం చివరి ట్రేడింగ్ సెషన్లో సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 80,158 వద్ద, నిఫ్టీ 50 కూడా 17 పాయింట్లు పెరిగి 24,423 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్(sensex) 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయిలో ఉండగా, నిఫ్టీ(nifty) 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (జులై 25న) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ 2024 (budget 2024) తర్వాత నిఫ్టీ నెలవారీ గడువు నేడు ముగుస్తుంది. దీంతో ఈరోజు ట్రేడింగ్ భారీ పతనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.35 గంటల నాటికి సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి 79,600 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 154 పాయింట్ల నష్టపోయి 24,263 పరిధిలో ఉంది.
బడ్జెట్ 2024కు ముందు రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) సోమవారం (జులై 22న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో మొదలైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) నేడు (జులై 19న) వారంతంలో భారీ నష్టాలతో మొదలయ్యాయి. నిన్న రికార్డ్ జంప్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఈరోజు అమ్మకాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.