Home » Sensex
గడిచిన రెండ్రోజులుగా బేర్ రంకెతో స్టాక్ మార్కెట్ షేర్లు తగ్గుతూ వస్తుండగా.. బుధవారం కాస్త ఉపశమం లభించింది. ఐటీ స్టాక్లలో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్పై సానుకూలంగా ప్రభావం చూపించాయి.
హిండెన్బర్గ్(Hindenburg) ఆరోపణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ హిండెన్బర్గ్.. సెబీ చైర్పర్సన్పై ఆరోపణలు చేయడంతో ఇవాళ్టి మార్కెట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్టు 12న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 9న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 819.69 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 79,705.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 250.50 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 24,367.50 వద్ద ముగిసింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 327, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ 493 పాయింట్లు లాభపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం (ఆగస్టు 8న) రోజంతా హెచ్చుతగ్గులకు లోనై చివరకు నష్టాలతో(losses) ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 582 పాయింట్లు పతనమై 78,886 వద్ద ముగిసింది. నిఫ్టీ(nifty) 181 పాయింట్లు పతనమై 24,117 వద్దకు చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్ 38 పాయింట్లు పెరిగి 50,157 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్లో(stock market) అనేక మంది పెట్టుబడిదారులు ప్రతి ఏడాది మల్టీబ్యాగర్ స్టాక్ల(Multibagger Stock) కోసం వెతుకుతుంటారు. ఎందుకంటే ఈ స్టాక్స్పై పెట్టుబడి చేస్తే తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందవచ్చు. ఈ జాబితాలో ప్రస్తుతం హైదరాబాద్(hyderabad)లో కూడా ఓ కేంద్రం ఉన్న ఈ కంపెనీ చేరింది. ఈ సంస్థ గత మూడేళ్లలో మదుపర్లకు 460 శాతం లాభాలను అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు(stock market) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు కూడా భారత స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలతో ముగిసింది. అయితే ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు(investors) ఆందోళన చెందవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్లో భారీగా పతనమైన మంచి షేర్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది. ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ భారీ నష్టాలను నమోదు చేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) ఐపీఓల(ipos) వారం రానే వచ్చింది. ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమయ్యే వారంలో 3 కొత్త IPOలు రాబోతున్నాయి. వీటిలో 2 మెయిన్బోర్డ్ సెగ్మెంట్ నుంచి 1 SME సెగ్మెంట్ నుంచి వస్తుంది. ఇవి కాకుండా గత వారంలో ఇప్పటికే ప్రారంభించిన ఐదు IPOలలో కూడా డబ్బును పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది.