Home » Secundrabad
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) ఎదురుగా ఉన్న హోటల్లో బాంబు పెట్టానని, కాసేపట్లో పేలుతుందని పోలీస్ కంట్రోల్ రూమ్(Police control room)కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. పోలీసులు హోటల్లో విస్తృత తనిఖీ చేసి బాంబు లేదని గోపాలపురం పోలీసులు నిర్ధారించారు.
బీదర్ వయా సికింద్రాబాద్గా నిజాముద్దీన్కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు.
కుంభమేళా జరిగే ప్రదేశాలకు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) పరిధిలో 140 ప్రత్యేకరైళ్లు నడిపామని అధికారులు ప్రకటించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయా రైళ్లలో సుమారు 1.30లక్షల మంది రిజర్వేషన్ చేసుకున్న గయా, దానాపూర్, పాట్నా, ఆజంఘడ్, ప్రయాగరాజ్, రక్సాల్, బనారస్, గోమతినగర్(లక్నో) ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లివచ్చారని తెలిపారు.
రైలు ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగులో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. కాచిగూడ రైల్వే పీఎస్ సీఐ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట హైదర్షాకోట్(Gandipet Hydershakot)లో నివాసం ఉంటున్న సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో కాచిగూడ(Kachiguda)కు బయలుదేరారు.
ఓ 50 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. కానీ దహన సంస్కారాలకు డబ్బులు లేని కారణంగా మృతదేహాన్ని ఆమె కుమార్తెలు ఇంట్లోనే 8 రోజుల పాటు ఉంచుకున్నారు. ఈ క్రమంలోనే వారు స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీఓఎం)గా కె.పద్మజ(K.Padmaja) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్కి చెందిన పద్మజ పీసీసీ ఎంగా విధులను నిర్వర్తిస్తూనే పీసీఓఎంగా అదనపు బాధ్యతలను నిర్వహించారు.
మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో నడిచే 4 ఎక్స్ప్రెస్ రైళ్ల(Express trains)ను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్ బొల్లారం(Secunderabad Bollaram)లోని రాష్ట్రపతి నిలయంలో ‘ఉద్యాన్ ఉత్సవ్’ గురువారం ప్రారంభమైనది. ‘ఉద్యాన్ ఉత్సవ్’ జనవరి 2 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్దికి నిర్వతం కృషి చేయడానకి ఉధ్యాన్ ఉత్సవ్ను ఏర్పాటు చేశారు.
క్రిస్మస్, మహాకుంభ మేళా(Christmas, Mahakumbh Mela) పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్ఓ శ్రీధర్(South Central Railway CPRO Sridhar) తెలిపారు.
రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్లలో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం లాంటివి చేస్తే రైల్వేయాక్ట్లోని 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.