Home » Secunderabad
2024పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తలపై బోనంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.
సికింద్రాబాద్: ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు ఆదివారం తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.
రేపు, ఎల్లుండి (శని, ఆది) జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్గా అవతరించబోతుందని వెల్లడించారు.
Telangana: భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే గోల్కొండ అమ్మవారికి బోనమెత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈనెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్లో పర్యటించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) నుంచి శ్రావణమాసం ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ‘దివ్య జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరిట ఆగస్టు 4 నుంచి 12 వరకు పలు పుణ్యక్షేత్రాలను దర్శించేలా టూర్ను ప్లాన్ చేశారు.
ఖార్ఖాన, యాంటీ నార్కోటిక్ బ్యూరో (Anti Narcotic Bureau) పోలీసులు కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న 8మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal) తెలిపారు. వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్ వాసుల ఎదురుచూపులు ఫలించాయి..! సికింద్రాబాద్ కంటోన్మెంట్తోపాటు.. దేశంలోని అన్ని కంటోన్మెంట్లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మునిసిపాలిటీలు/కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది.