Home » Secunderabad
మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఇందులో రెండు ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్కు, 7, 9 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్ నుంచి చర్లపల్లి(Danapur to Cherlapalli)కి రానున్నాయి.
‘మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ పర్యాటక రైలును సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సోమవారం ప్రారంభమైంది. ఈ రైలును యాత్రికుల్లో ఒకరైన తపన్ చంద్ర(77) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) గ్రూప్ జనరల్ మేనేజర్ పి. రాజ్ కుమార్ సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు.
భారతీయ రైల్వేకు స్టేషన్ల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వస్తున్నాయి. అయితే రైల్వేకు ఆదాయం ఎలా వస్తుంది, ఏ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువగా వస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)కు కూతవేటు దూరంలో ఉన్న మల్కాజిగిరి రైల్వేస్టేషన్(Malkajgiri Railway Station) అభివృద్ధితో రూపురేఖలు మారనున్నాయి. అమ్రిత్ భారత్ స్టేషన్ సికింద్రాబాద్స్కీంలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబందించి నిర్మాణాలు చకచక జరిగిపోతున్నాయి.
అధునాతన సౌకర్యాలతో ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్(Cherlapalli Terminal) నుంచి చెన్నై, గోరఖ్పూర్ వెళ్లే రెండు రైళ్ల తేదీలను అధికారులు ఖరారు చేశారు. మార్చి 7వ తేదీ సాయంత్రం 16.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే (నం. 12603) రైలు 8వ తేదీ ఉదయం 5.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కొత్త సంవత్సరంలో రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఇటివల దక్షిణ మధ్య రైల్వే 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. అయితే ఈ పోస్టులను ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయనున్నారు.
ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రకు రైలులో సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారని సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావీద్ తెలిపారు.
ఒడిశా(Odisha) నుంచి సికింద్రాబాద్ మీదగా మహారాష్ట్ర(Maharashtra)కు రైలులో పొడి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారని సికింద్రాబాద్ రైల్వే డీస్పీ జావీద్, సీఐ సాయి ఈశ్వర్గౌడ్ తెలిపారు.
సికింద్రాబాద్-ముజాఫర్పూర్(Secunderabad-Muzaffarpur) మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు(కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.