Home » Schools
రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభానికి వేళయింది. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ వంటి అన్నిరకాల స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించడానికి పుస్తకాలు, యూనిఫామ్లను ఇప్పటికే సిద్ధం చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ‘‘చిట్టి’’ హంగామా చూశారు కదా..? ఆ ‘రోబో’ అంతా సూపర్ ఫాస్ట్..! ఏదైనా చకచకా చేసేస్తుంది..! టకటకా చెప్పేస్తుంది..! ఇప్పుడు ఇలాంటి రోబో టీచర్లు ‘చిట్టెమ్మ’లను హైదరాబాద్లోని నెక్ట్స్ జెన్ స్కూల్స్లో ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలిందని, అందుకే దీనిపై ఆలోచిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేయొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జేఈఈ అడ్వాన్స్డ్-2024 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో సందేష్ భాగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్దీప్ మిశ్రా (6వ ర్యాంకు), ఎం. బాలాదిత్య (11వ ర్యాంకు), రాఘవ్ శర్మ (12వ ర్యాంకు), బిస్మిత్ సాహు (16వ ర్యాంకు), ఆర్యన్ ప్రకాశ్ (17వ ర్యాంకు), అమోఘ్ అగర్వాల్ 20వ ర్యాంకు సాధించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్లు వంటి వాటి విక్రయాలపై నిషేధం విధిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
గత రెండు రోజులుగా భారతదేశం అంతటా తీవ్రమైన ఎండ వేడిగాలులు(heatwave) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ(delhi), బిహార్(bihar) సహా పలు ప్రాంతాల్లో 50కి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రాష్ట్రంలో బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని, జిల్లా స్థాయిలో వారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
మండలకేంద్రంలోని జిల్లా పరిషత పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలంతా కలిశారు. రోజంతా సంతోషంగా గడిపారు. గ్రామానికి చెందిన ఎనఆర్ఐ కేఆర్ ప్రవీణ్ స్థానిక జిల్లా పరిషత పరిగి పాఠశాలకు వచ్చాడు. ఈ విషయం తెసుకున్న ఆ పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలందరూ అక్కడికి చేరుకున్నారు.
రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ నిడివి దాదాపు ఖరారైంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా 2 నిమిషాల 30 సెకన్ల నిడివికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు చరణాలు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. సంగీత దర్శకుడు కీరవాణితో ఆదివారం ఆయన స్టూడియోలో భేటి అయ్యారు.