Home » Schools
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.
వేసవి సెలవుల తర్వాత గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల ప్రాంగణాలు కిటకిటలాడాయి. పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్లను ముస్తాబు చేశారు. విద్యార్థులకు స్వాగత తోరణాల మధ్య ఆహ్వానం పలికారు. పలు స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్టూడెంట్ కిట్లు సైతం ఎమ్మార్సీల నుంచి స్కూల్ పాయింట్కు చేరుస్తున్నారు....
ఫిట్నెస్, అనుమతి పత్రాలు లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బుధవారం విద్యార్థులను స్కూళ్లకు చేరవేస్తున్న బస్సులను ఆపి విస్తృత స్థాయిలో తనిఖీ చేశారు. పదుల సంఖ్యలో బస్సు లు ఫిట్గా లేవని, ఇంకొన్నింటికి అనుమతి లేదని, మరికొన్నింటిని పన్ను చెల్లించకుండా తిప్పుతున్నారని గుర్తించారు.
ఒకప్పుడు ‘మీ ఊరికి ఏం కావాలి’ అని ఏ మంత్రో, నాయకుడో అడిగితే... పిల్లోళ్ల్లు చదువుకోడానికి ‘ఊరిబడి’ కావాలని కోరేవారు. గుడి కన్నా బడే ముఖ్యమని నమ్మేవాళ్లు. ఊళ్లో బడి ఉంటే పిల్లలు బడిబాట పడతారని, చదువుకుని బాగుపడతారన్నది పెద్దల నమ్మకం. కిలోమీటర్ల దూరం నడవకుండా ఊరిలో ఉండే బడికి పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్తారని దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి ప్రాథమిక పాఠశాలలను 2019-2024 మధ్య ఉన్న జగనరెడ్డి ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చేసింది. 117 జీవో ...
వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన 12 నుంచి తరగతులు పునఃప్రారంభమౌతాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఒక్కరోజు అదనపు సెలవు వచ్చింది. 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత, మున్సిపల్, అన ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్.. ఇలా అన్ని యాజమాన్యాల్లో 2,423 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,81,091 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ...
రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభానికి వేళయింది. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ వంటి అన్నిరకాల స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించడానికి పుస్తకాలు, యూనిఫామ్లను ఇప్పటికే సిద్ధం చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ‘‘చిట్టి’’ హంగామా చూశారు కదా..? ఆ ‘రోబో’ అంతా సూపర్ ఫాస్ట్..! ఏదైనా చకచకా చేసేస్తుంది..! టకటకా చెప్పేస్తుంది..! ఇప్పుడు ఇలాంటి రోబో టీచర్లు ‘చిట్టెమ్మ’లను హైదరాబాద్లోని నెక్ట్స్ జెన్ స్కూల్స్లో ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలిందని, అందుకే దీనిపై ఆలోచిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేయొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జేఈఈ అడ్వాన్స్డ్-2024 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో సందేష్ భాగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్దీప్ మిశ్రా (6వ ర్యాంకు), ఎం. బాలాదిత్య (11వ ర్యాంకు), రాఘవ్ శర్మ (12వ ర్యాంకు), బిస్మిత్ సాహు (16వ ర్యాంకు), ఆర్యన్ ప్రకాశ్ (17వ ర్యాంకు), అమోఘ్ అగర్వాల్ 20వ ర్యాంకు సాధించారు.