Home » Schools
పట్టణంలోని ప్రభుత్వంబాలికోన్నతపాఠశాలలో ఐదు సంవత్సరాలుగా స్టోర్ గదిలో మూలప డే శారు. ఆ 15 సైకిళ్లను ఇప్పుడైనా విద్యార్థి నులకు పంపిణీ చేసి సద్వినియోగం అ య్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బాలికల్లో విద్యను ప్రోత్సహిస్తూ, వారిలో అక్షరాస్యతను పెంపొందించడానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉచితంగా వారికి సైకిళ్లు పంపిణీ చేసింది.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో సంక్షేమ వసతిగృహాలకు మంచిరోజులు వచ్చినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ వసతిగృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మెయినటెనెన్స ఫండ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క భవనాన్ని నిర్మించకపోగా... ఉన్న వాటిని శిథిలావస్థకు చేర్చేసింది. వసతిగృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పనను పెడ చెవిన పెట్టింది. దీంతో వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ ఐదేళ్లు గడిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ...
ఇటీవల డ్రగ్స్ తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
బడులు మళ్లీ తెరుచుకున్నాయి. కొత్త విద్యాసంవత్సరం.. కొత్త తరగతి.. కొత్త పుస్తకాలు, బ్యాగు, యూనిఫాంతో పిల్లలు హుషారుగా వెళుతున్నారు! కానీ బడికి వెళ్లి వచ్చేందుకు వారు ఎక్కుతోంది ఫిట్నెస్ లేని బస్సుల్లో! వారి ప్రయాణం సాగుతోంది ప్రమాదపుటంచుల్లో! బడులు తెరుచుకొని నాలుగురోజులైనా రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా ఫిటెనెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి.
జాతీయస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో సత్తా చాటిన ఓ యువతి ప్రాజెక్టుకు పేటెంట్ హక్కులు లభించాయి. యాదా ద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెంది న కుమ్మరి శ్రావణి ప్రస్తుతం బిహార్లోని పట్నా ఐఐటీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది.
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.
వేసవి సెలవుల తర్వాత గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల ప్రాంగణాలు కిటకిటలాడాయి. పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్లను ముస్తాబు చేశారు. విద్యార్థులకు స్వాగత తోరణాల మధ్య ఆహ్వానం పలికారు. పలు స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్టూడెంట్ కిట్లు సైతం ఎమ్మార్సీల నుంచి స్కూల్ పాయింట్కు చేరుస్తున్నారు....
ఫిట్నెస్, అనుమతి పత్రాలు లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బుధవారం విద్యార్థులను స్కూళ్లకు చేరవేస్తున్న బస్సులను ఆపి విస్తృత స్థాయిలో తనిఖీ చేశారు. పదుల సంఖ్యలో బస్సు లు ఫిట్గా లేవని, ఇంకొన్నింటికి అనుమతి లేదని, మరికొన్నింటిని పన్ను చెల్లించకుండా తిప్పుతున్నారని గుర్తించారు.
ఒకప్పుడు ‘మీ ఊరికి ఏం కావాలి’ అని ఏ మంత్రో, నాయకుడో అడిగితే... పిల్లోళ్ల్లు చదువుకోడానికి ‘ఊరిబడి’ కావాలని కోరేవారు. గుడి కన్నా బడే ముఖ్యమని నమ్మేవాళ్లు. ఊళ్లో బడి ఉంటే పిల్లలు బడిబాట పడతారని, చదువుకుని బాగుపడతారన్నది పెద్దల నమ్మకం. కిలోమీటర్ల దూరం నడవకుండా ఊరిలో ఉండే బడికి పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్తారని దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి ప్రాథమిక పాఠశాలలను 2019-2024 మధ్య ఉన్న జగనరెడ్డి ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చేసింది. 117 జీవో ...
వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన 12 నుంచి తరగతులు పునఃప్రారంభమౌతాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఒక్కరోజు అదనపు సెలవు వచ్చింది. 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత, మున్సిపల్, అన ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్.. ఇలా అన్ని యాజమాన్యాల్లో 2,423 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,81,091 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ...