Home » Schools
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి మంగళవారంనాడు నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
అందీ అందని పౌష్టికాహారం.. చిన్నారులపై మొక్కుబడి పర్యవేక్షణ.. పారిశుధ్య లోపం..! ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల స్వరూపం ఇది. ఇకపై మాత్రం.. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు.. బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి.
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎండబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో భోజన, శానిటేషన్ కాంట్రాక్ట్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహిళా గ్రూపులు తమను సంప్రదిస్తే పనులను అప్పగిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.
శివగంగ జిల్లా మరవమంగళం గ్రామంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాల(Primary school) కొత్త రూపు సంతరించుకుంది. ఇటీవల ఆ పాఠశాలకు రూ.10.67లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ప్రతి తరగతి గదిని రైలు బోగీ(Train bogie)లా పెయింటింగ్ చేశారు.
Telangana: అమ్మో ఆ స్కూల్లో దెయ్యం ఉంది.. మాకు భయం.. మేం స్కూల్కు వెళ్లం అని భయపడుతున్నారు అక్కడి విద్యార్థులు. అయితే స్కూల్లో విద్యను చెప్పే టీచర్లు... విద్యార్థులకు ధైర్య సాహసాలు కూడా నేర్పిస్తుంటారు.
తాత్కాలిక సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ను కల్పిస్తున్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని వెళుతున్న వీరు బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. గ్రామంలో ఉన్న పాఠశాలలో గదుల కొరత ఉంది. దీంతో ఉన్నత పాఠశాల భవనాన్ని ఊరికి దూరంగా నిర్మిస్తున్నారు. పనులు పూర్తి కాకనే.. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను అక్కడికి తరలించి.. పాఠాలు చెబుతున్నారు. కానీ మధ్యాహ్న భోజనం మాత్రం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే పెడుతున్నారు. దీంతో రోజూ ఇలా కి.మీ. దూరం తట్టలు ఎత్తుకుని ...