Home » Schools
ప్రైవేటు స్కూళ్లలో పదోతరగతి ఫెయిల్ అయినవారే ఉపాధ్యాయులుగా ఉన్నారంటూ.. వారిని అవమానించేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం తగదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కారం మెతుకులతో కడుపు నింపుకోవాల్సిందేనా.. మధ్యాహ్న భోజనంలో ఏం పెడుతున్నారు.. పిల్లలకు అందించే మెనూపై ప్రభుత్వం స్పందించాలని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్ బ్యూరో(Bureau of Narcotics) అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు.
నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్పై ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు శుక్రవారం దాడి చేశారు. అదే పాఠశాల హాస్టల్లో ఉంటున్న తమ చిన్నారులపై ఆయన కొన్నాళ్లుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆంజనేయులు గౌడ్ వయసు 77 ఏళ్లు. విద్యాసంస్థల నిర్వహణతోపాటు సాహితీ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నగరవాసులకు సుపరిచితులు. ఆయనపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లారు. నాలుగు, ఐదో ...
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ కిచెన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ప్రాథమిక పాఠశాల పనివేళల మాదిరిగానే హైస్కూల్ పనివేళలూ ఉంటాయి.
వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్.వి.దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.