Home » Sangareddy
Cool Drink Incident: సదాశివపేట మండలం పెద్దాపూర్లోని ఓ హోటల్కు వచ్చారు ముగ్గురు యువకులు. బాగా ఎండగా ఉండటంతో కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టారు. సర్వర్ కూల్ డ్రింక్ తెచ్చి ఇవ్వగా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆ యువకులు దాన్ని తాగారు. ఆ వెంటనే యాదుల్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి దానిని అక్కడకు తరలించారు. పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో వేలిది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే.. ఎక్కడినుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. అనంతరవ విషయాన్ని అదికారులకు తెలియజేయగా ఎట్టకేలకు దానిని గుర్తించి బంధించారు.
దేశ ప్రజల కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానిదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ పుట్టి పెరిగిన స్వరాజ్ భవన్ను ఇందిరా గాంధీ దేశం కోసం ధారాదత్తం చేశారని గుర్తుచేశారు.
Leopard: సంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత హడలెత్తించింది. టైగర్ ఉందని తెలియడంతో ఇక్రిశాట్ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లు, ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు బిగించారు. దీంతో అటువైపు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజర్లలో దారుణం చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టాడు.
ఎన్వోసీ జారీ చేసేందుకు రూ. పది లక్షల లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిషోర్ ఏసీబీకి చిక్కారు. పటాన్చెరులోని నీటిపారుదల శాఖ డివిజనల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. డ్రోన్లను ఆపరేట్ చేయడంలోనూ వారికి శిక్షణ ఇస్తున్నాయి. పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడంపై మహిళలకు తర్ఫీదునిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిష్ఠిత సంస్థ హోదా కల్పించింది.
అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలు రాత్రి నిద్రపోయినవారు నిద్రపోయినట్లుగా ప్రాణాలొదలడం.. పక్కనే నిద్రించిన తల్లి అర్ధరాత్రి తర్వాత కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన ఘటన గుర్తుందా? వారం క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ఈ ఘటనలో వేళ్లన్నీ భర్తవైపే చూపాయి.
Ameenpur Case Twist: అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.