Home » Sangareddy
గంజాయి ముఠాలు పట్టుబడితే ఆ పోలీసులకు పండగే! పట్టుబడ్డ సరుకులోంచి కొంత దారి మళ్లించి సొమ్ము చేసుకుంటారు. కొన్ని నెలలుగా వారిది ఇదే పని! ఓ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారించిన సమయంలో ఈ దందా బయటపడింది.
సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై మరో వర్గం కుకూనురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టుయిన వారికి బీజేపీ ఎంపీ ఆర్ రఘునందన్రావు మద్దతుగా నిలిచారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారని, ఆర్థిక అంశాలు కాకుండా మిగిలిన సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామన్నారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు.
ఈమె పేరు సున్నపు భవానీ. సంగారెడ్డి(Sangareddy) జిల్లా కోహీర్(Kohir) మండలం గురుజువాడ(Gurujuwada) అనే మారుమూల గ్రామంలో నివసిస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయింది.
ఓ కలెక్టర్కు తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని, దీంతో తనకు కోసం వచ్చి తిట్టానంటూ బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత కలెక్టర్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా లేదంటే గతంలో ఎప్పుడైనా జరిగిన సంఘటనను ..
ఐఐటీ-హెచ్ స్టార్టప్ సంస్థ ప్యూర్ ఈవీ ఇట్రి్స్ట-ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 5-6 గంటలు చార్జింగ్ పెడితే 90 కి.మీ. వేగంతో 171 కి.మీ. వెళుతుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు నిశాంత్ దొంగరి తెలిపారు.
ఈ వయసులో పార్టీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి రాజకీయ ఇబ్బందులు రావడం బాధాకరమని, అధిష్ఠానం దీన్ని గుర్తించి త్వరితగతిన ఆయన సమస్యకు పరిష్కారం చూపాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది బీరు తాగుతుంటారు. సంతోషమైనా.. బాధైనా.. వెంటనే వైన్ షాపులో తేలిపోతుంటారు. ముఖ్యంగా యువత.. నలుగురు స్నేహితులు కలిశారంటే చాలు.. ఇక బీర్ల జాతరే. చల్ల చల్లని బీర్లను కుమ్మేస్తుంటారు. మీరు కూడా బీర్లు తెగ తాగేస్తున్నారా? చల్లగా ఉందని..
జనం లేని ఊరేమిటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడ ఊరు ఉండదు.. కానీ ఊరు ఉన్నట్లు సజీవ సాక్ష్యాలు కనిపిస్తాయి. రెవెన్యూ భూములు కూడా ఆ పల్లె పేరిటే కొనసాగుతున్నప్పటికీ జనం మాత్రం కనిపించరు. తాండూరు మండలం గోనూరు పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న మాచనూరుపై ప్రత్యేక కథనం.
వ్యాపారంలో నష్టం, కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.