Home » Sajjala Ramakrishna Reddy
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.
Andhrapradesh: ఈ నెల 25వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారని.. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉందని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ వైఖరికి.. ఎన్నికల తర్వాత వైఖరికి పెద్దగా మార్పులేదనే చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత అయినా ఆయన తన పద్ధతి మార్చుకుంటారని ఆశించామని..
సినీ నటి నత్వాని అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం ఏంటీ అని నిలదీశారు. ఆ అమ్మాయి ఆస్తులను రాయించుకొని.. బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు.
వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాయి. పైకి ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులుగా కనిపించే కొందరు ఐపీఎస్లు వైసీపీ నేతల అరాచకాలకు వంతపాడినట్లు తెలుస్తోంది.
Andhrapradesh: రెవిన్యూ, రిజిస్ట్రేషన్ ఫారెస్టు, ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ మోసగాల్లు రికార్డులు తారుమారు చేసి వేల కోట్లు సంపాదించారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... చివరికు దేవుని మాన్యం భూములు, వక్స్ బోర్డు భూములను కూడా కబ్జా చేశారన్నారు.
Andhrapradesh: నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరు నెలలైనా సమయం ఇవ్వాలని... అయితే ఆ సమయం ఇవ్వకుండా కల్కి సినిమాలో కమాండర్ చేసినట్టు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కాంప్లెక్స్లో కూర్చుని ఆ కుట్రలు చేస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ (Judicial Review Commission)ను నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ (Surya Narayana) ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 24న జరిగే ఏపీ క్యాబినెట్ మెుదటి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తాను ఎంపీగా ఉండగా.. జగన్ తన సలహాలు పాటించారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. సీఎంగా గెలుచిన తరువాత జగన్ బాగా మారిపోయారన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ధనంజయరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల మిథున్ రెడ్డి వల్లనే వైసీపీని వీడాల్సి వచ్చిందన్నారు. వైసీపీలో సొంత పార్టీ వారిపై కేసులు పెట్టించిన ఘనత సజ్జలదేనని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయితే ఆయన తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రమే సాధారణ పరిపాలన శాఖకు అందజేసినట్లు తెలుస్తుంది.