Home » Rythu Bandhu
రైతు భరోసాపై శాసనసభ, శాసనమండలిలో చర్చించి సంక్రాంతి పండుగ నుంచి డబ్బును రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతుబీమా పథకంలో కొత్త రైతుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని, పథకంలో లేని వారి పేర్లను నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి శనివారం సర్క్యులర్ జారీచేశారు.
రైతు భరోసా (Rythu Bharosa) పథకం అమలుపై రేవంత్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.
‘రైతుబంధు’ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా.. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Telangana: తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. రైతు భరోసా పథకంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం రైతుభరోసా(రైతుబంధు) నిధులు విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నాడు ‘రైతు నేస్తం’(Rythu Nestham) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’.
రైతుబంధు సాయానికి బ్రేక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ఈనెల 12వ తేదీ వరకే రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తరువాత రోజు నుంచి రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలో జమకావడం లేదు.
Telangana: మేడిగడ్డపై సంబంధిత మంత్రి స్పందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా భవన్లో ఎవరైనా రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవొచ్చని అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
Telangana Elections: ఎన్నికల లబ్ది కోసం రైతుబంధుని వారి అకౌంట్లో వేసే కార్యక్రమం చేపట్టాలని కుట్రలతో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడుతూ.. అక్టోబర్ 26నాడే కేంద్ర ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ విన్నపం ఇచ్చిందని చెప్పారు.