Home » Russia-Ukraine war
దేశంలో జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు చేసుకోండర్రా.. పిల్లలను కనండర్రా అని యువతకు ఉద్బోధిస్తోంది చైనా!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తున్న కంపెనీలు, వ్యక్తులపై అమెరికా కన్నెర్ర చేసింది. 400 సంస్థలు సహా వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
ఉక్రెయిన్తో వివాదం కొనసాగుతున్న వేళ రష్యాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అణు బలగాలు ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆదేశాలు అందడంతో ఈ స్పెషల్ డ్రిల్స్ను మొదలుపెట్టాయి. ఈ పరిణామంపై రష్యాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పందించారు
తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభాన్ని ఆయన ఆపగలరని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలై దాదాపు 30 నెలలు గడుస్తోంది! భౌగోళికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం (1,71,25,191 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 16 దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది).. 11.5 లక్షల సైనిక బలం, అణ్వాయుధాలు ఉన్న దేశం..
ఉక్రెయిన్ నుంచి డ్రోన్ దాడులు భయపెడుతున్న వేళ.. రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధం కొలిక్కిరాని సమయంలో.. పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలిస్తే ప్రత్యర్థిని ఓడిస్తామని జెలెన్ స్కీ కోరుతున్న సందర్భంలో రష్యా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య రెండున్నరేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.