Home » Russia-Ukraine war
ఏడాదికిపైగా సాగుతున్న ఉక్రెయిన్ - రష్యా(Ukraine - Russia) యుద్ధ నేల అధినేతలతో ప్రధాని మోదీ(PM Modi) బుధవారం సుదీర్ఘంగా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడి.. తరువాత ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదమిర్ జెలెన్క్సీతో ఫోన్లో సంభాషించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తాజాగా పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్కి (Ukraine) మద్దతుగా అమెరికా (America) తన సైన్యాన్ని పంపితే.. అణు యుద్ధం (Nuclear War) తప్పదని హెచ్చరించారు. తమ దేశం అణు యుద్ధానికి సాంకేతికంగా సిద్ధంగా ఉందన్న ఆయన.. ఉక్రెయిన్కు అమెరికా దళాలను పంపితే, అది యుద్ధానికి ఆజ్యం పోసినట్లుగా పరిగణించబడుతుందని అన్నారు.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం(ukraine russia war) మొదలై గత నెల నాటికి రెండు సంవత్సరాలు పూర్తైంది. కానీ ఈ దేశాల మధ్య శాంతి నెలకొనలేదు. ఈ నేపథ్యంలోనే ఇటివల రష్యా క్షిపణి మరోసారి దాడి(missile attack) చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి రష్యాకు వెళ్లాడు ఓ యువకుడు. తీరా ఉద్యోగం పేరుతో రష్యా సైన్యంలో అతన్ని చేర్పించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్తో రష్యా జరుపుతున్న యుద్ధంలో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్కి చెందిన ఆ యువకుడి కుటుంబంలో విషాదం నింపింది.
రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి.. మొదట్లో ఈ యుద్ధం రోజుల్లోనే ముగుస్తుందని అంతా భావించారు. కానీ.. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రారంభ రోజుల్లో ఉక్రెయిన్పై రష్యా (Russia) ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల సహకారంతో ఉక్రెయిన్ (Ukraine) కూడా విజృంభించడం మొదలుపెట్టింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందా? అంటే అవుననే బదులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. తమకు అమెరికా, జర్మనీతో పాటు ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి.. ఉక్రెయిన్ వివాదం ‘వరల్డ్ వార్ 3’గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఉక్రెయిన్లో మళ్లీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లోని డొనెట్స్క్ నగర శివార్లలోని మార్కెట్పై ఆదివారం క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటలో 13 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు కావొస్తున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించింది కానీ, పాశ్చాత్త దేశాల సహకారంతో ఉక్రెయిన్ కూడా విజృంభించింది. రష్యా దాడులకు కౌంటర్ ఇస్తూ ఇస్తోంది.
గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేయనుందా? అంటే.. జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన రహస్య పత్రాల్లోని సమాచారం అవుననే చెప్తోంది. ఈ కీలక సమాచారం బైల్డ్ వార్తాపత్రికలో ప్రచురితమైంది.