Home » RSS
దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ వలంటీర్లు విశిష్ట సేవలందిస్తున్నారని మోదీ అన్నారు. నాగపూర్లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.
పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో 'ఇండియా' కూటమి భాగస్వామ పార్టీల మధ్య సల్ప తేడాలు ఉండవచ్చనీ, కానీ దేశ విద్యా వ్యవస్థ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాహుల్ గాంధీ అన్నారు.
ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతx రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలె సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.
సంఘ్ కింద 32 సంస్థలు పనిచేస్తున్నాయనీ, ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పని చేస్తుందని, సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రతి సంస్థకు సొంత సభ్యులు, ఎన్నికలు, స్థానిక-జిల్లా-మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు.
నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు.
బీజేపీ నేతలపై మంత్రి ప్రియాంకఖర్గే విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు ఇదేం ఆర్ఎస్ఎస్ ఆఫీసు కాదు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని మోహన్ భాగవత్ అన్నారు.
RSS New Head Quarters Delhi : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త ఇంటిలోకి ప్రవేశించింది. అత్యాధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా నిర్మించిన ఈ అద్భుతమైన భవనం పేరు.. 'కేశవ్కుంజ్'. గుజరాత్ ఆర్కిటెక్ట్ అనూప్ డేవ్ సారథ్యంలో రూపొందించిన ఈ RSS కార్యాలయంలో ఫిబ్రవరి 19 నుంచి పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం...
కాంగ్రెస్ పార్టీ.. ఆరెస్సెస్, బీజేపీతోనే కాక.. భారత రాజ్యవ్యవస్థతో కూడా పోరాడుతోందని ఆ పార్టీ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్కు రాజ్ఘాట్ మెమోరియల్ సైట్ వద్ద స్థలం కేటాయించాలని యావద్దేశం డిమాండ్ చేస్తే దానిని తోసిపుచ్చిన మోదీ ప్రభుత్వం అదే స్థలంలో ముఖర్జీ స్మారకానికి నిర్ణయించిందని డేనిష్ అలీ అన్నారు.