Home » Rouse Avenue Court
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కస్టడీని పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో నాలుగు రోజులు కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది.