Home » RJD
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది.
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను గవర్నర్ అనుసూయియా యూకీకి తెలిపారు. ఈ ఎంపీలు గవర్నర్ను కలుసుకున్న తర్వాత రాజ్ భవన్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని మణిపూర్ గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey)ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి, సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడారు.
Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు.
అట్టడుగు వర్గాలపై విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న 'రామచరితమానస్'ను తుగులబెట్టాలంటూ ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో మరో ఆర్జేడీ నేత, దినాపూర్ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ ఆ వివాదాన్ని తిరగదోడారు. రామచరితమానస్ను మసీదులో రాశారని రిట్లాల్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో రాష్ట్రీయ జనతాదళ్ పోల్చడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. బీహార్కు సంబంధించిన పార్టీ ఈ కోణంలో పోలిక తీసుకురావడం సరికాదని అన్నారు.
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సనాతన ధర్మ సంప్రదాయాలు, ఆచారాలు, పూజలు,
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈనెల 28న జరుగనున్న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్టు రాష్ట్రీయ జనతా దళ్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే), ఎన్సీపీ బుధవారంనాడు ప్రకటించాయి. టీఎంసీ, సీపీఐ, ఆప్ ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లేదని ప్రకటించాయి.
నితీశ్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లక్నోలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను కలుసుకున్నారు.