Home » Resign
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనతో సహా తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారంనాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. అందుకు అంగీకరించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం జరిగేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.
ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్.. ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత సమ్మతిపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంటనే ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జి జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట!
తెలంగాణ గడ్డపై రుణమాఫీ అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఆగస్టు 16వతేదీ లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణ మాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.
గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని ఇన్నాళ్లు ఒత్తిడి చేసిన అధికార పార్టీ నేతలు రూటు మార్చారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసినా.. ఆశించిన స్థాయిలో వలంటీర్లు స్పందించకపోవడంతో... వలంటీర్లుగా పని చేస్తే ఇబ్బందులు తప్పవని,
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి బుధవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా సమర్పించారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన తొలి వ్యక్తి కూడా రాజ్కుమార్ ఆనంద్ కావడం విశేషం.
లోక్సభ ఎన్నికల వేళ హర్యానా లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు తెలిపారు.
అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని కీలక నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ సైతం వీడేందుకు సిద్దమైనట్లు ఓ చర్చ అయితే జిల్లాలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. స్వయంగా డొక్కా నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.
జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయు అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. పెన్షన్ల పంపిణీలో జరిగిన నిర్లక్ష్యంతో 32 మంది వృద్దులు చనిపోయారు. ఆ కుటుంబాలకు ఏం భరోసా ఇస్తావు జగన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయు అని సోషల్ మీడియా ఎక్స్లో నెటిజన్లు పోస్ట్ చేశారు.