Home » Reservations
మరాఠా రిజర్వేషన్ వివాదం మరింత ఉధృతం చేసేందుకు రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే నిర్ణయించారు. ఈనెల 26 నుంచి ముంబైలోని ఆజాద్ మైదాన్లో కానీ, శివాజీ పార్క్ గ్రౌండ్లో కానీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. జనవరి 20న అంతర్వాలీ సరాతీ గ్రామం నుంచి పాదయాత్రగా ముంబై చేరుకుంటామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి బీహార్ ప్రభుత్వం లాంఛనంగా పెంచింది. పెంచిన కోటాకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు.
బీహార్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
మరాఠా రిజర్వేషన్ పోరాట కార్యకర్త మనోజ్ జారంగే తమ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారంనాడు హెచ్చరించారు. మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే తమ డిమాండ్ను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పక్షంలో అక్టోబర్ 24 నుంచి తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయనున్నట్టు ప్రకటించారు.
మరాఠా రిజర్వేషన్ల డిమాండ్పై నిరవధిక నిరాహారదీక్ష సాగిస్తున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఉజయన్రాజే భోసలే సమక్షంలో దీక్ష విరమించేందుకు అంగీకరించారు. అయితే, ఆందోళన విరమించినప్పటికీ నిరసన స్థలి నుంచి కదిలి వెళ్లేది లేదన్నారు.
మరాఠా కమ్యూనిటీకి ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా లాతూరు లో శనివారంనాడు నిరసనలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవ్ (Mohan Bhagwat) రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఇంకా ఉందని, సమానత్వం వచ్చేవరకు రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగాలని అన్నారు. నాగ్పూర్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.