Home » RCB
డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
సయాలీ సత్ఘరే.. డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలకమైన మూడు వికెట్లను తీసి డెబ్యూలోనే అదరగొట్టింది. ఆర్సీబీకి ఆడాలన్న తన కోరిక నిజమైందంటూ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా రికార్డులోకెక్కింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. యూపీ వారియర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ స్పందించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన కెమెరామెన్పై అసహనం వ్యక్తం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డబ్ల్యూపీఎల్ 2026 శుక్రవారం ఘనంగా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆర్సీబీకి ఓటమి తప్పదనుకున్న స్థితిలోనాడిన్ డి క్లెర్క్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్నందించింది. తమ విజయంపై కెప్టెన్ స్మృతి మంధాన మ్యాచ్ అనంతరం మాట్లాడింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచులోనే అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆఖరి బంతి వరకు పోరాడి.. గెలుపు అంచున కూడా లేని ఆర్సీబీ జట్టు.. అనూహ్యంగా ముంబై ఇండియన్స్పై 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓటమిపై ఎంఐ కెప్టెన్ హర్మన్ మాట్లాడింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) తొలి మ్యాచ్లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 154 పరుగులు చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్(WPL-2026) సీజన్ షురూ అయింది. తొలి మ్యాచ్లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచింది.