Home » Rayalaseema
కోస్తా, రాయలసీమ (Rayalaseema) రైతులకు మాండస్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రెండు మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ జారీచేస్తున్న హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం అల్పపీడనం (low pressure) ఏర్పడింది.
గల్ఫ్ ఆఫ్ థాయ్ల్యాండ్ నుంచి ఆదివారం ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది.
సముద్రం మీదుగా కోస్తాపైకి తేమతో కూడిన తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి.
పసిఫిక్ మహా సముద్రం (The Pacific Ocean), దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన అండమాన్ సముద్రంలో అల్పపీడనం (low pressure) ఏర్పడనున్నది.
దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం (low pressure) పూర్తిగా బలహీనపడింది. అయితే అల్పపీడనంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) పరిసరాల్లో కొనసాగుతోంది.
వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకు 350 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 470 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.
దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయం బలపడి వాయుగండంగా మారింది.
అల్పపీడనం (low pressure) శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది.