Home » Rayadurg
డి. హీరేహాళ్ మండలంలోని ఎం హనుమాపురం నుంచి కణేకల్లు మండ లం జక్కలవడికి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకర తేలి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డి. హీరేహాళ్ మండలంలోని గ్రామా ల్లో తాగునీటి సమస్య పరిష్కారా నికి డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొ త్తం రూ. 27 లక్షల వ్యయంతో ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో బోరు బావులు, పంపుసెట్లు, పై పులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనట్లు ఆర్బబ్ల్యూఎస్ ఏఈ ధనుంజయ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్లోని రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మండలంలోని తార కాపురం గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి రథోత్సవం మంగ ళవారం సాయంత్రం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవం గా సాగింది. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేసి, అ లంకరించారు.
రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ కాల వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని శిరిగేదొడ్డి గ్రామంలో మం గళవారం రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీని ఆయన ప్రారంభించారు.
రా జకీయాల్లో వైసీపీ ఓ విషనాగు లాంటి పార్టీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ద్వజమోత్తారు. రాష్ట్రంలో కూటమి పాలనకు రెండేళ్లు నిండిన సందర్భంగా డి. హీరేహాళ్ మం డలం కల్యం గ్రామంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వ హించారు.
మండలంలోని మైలాపు రం గ్రామ శివారులో వేదావతి హగరి నదిపై నిర్మించిన బ్రిడ్జి మృత్యు ఒడిగా మారింది. డి. హిరేహాళ్ మండలం సోమలాపురం వైపు నుంచి వచ్చే వాహనదారులకు బ్రిడ్జి వద్ద ఉన్న ఆకస్మిక మలుపు ప్రమాదక రంగా ఉంది. మలుపును గుర్తించలేక వాహనాలు బ్రిడ్జిపై వేగంగా వ స్తూ కాలువలోకి దూసుకెళ్తున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి.
మేము ఉండగా సెక్యూరిటీ గార్డు ఎందుకు దండగా..? అన్నట్లుగా నాలుగైదు వీధికుక్కలు కణేకల్లులోని ఎస్బీఐ ఏటీఎం వద్దనే ఉంటున్నాయి. దీంతో ఖా తాదారులు ఏటీఎంలోకి వెళ్లాలంటేనే భయపడుతు న్నారు. ఖాతాదారుల భద్రత కోసం సెక్యూరిటీ గా ర్డు ఉండాల్సిన చోట అవి మకాం వేస్తుండడంతో వి నియోగ దారులు భయంతో ఏటీఎంలోకి అ డుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.
రెండేళ్ల కూటమి పాలన ప్రగతికి కానుకగా చంద్రబాబు పార్కును ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని బళ్లారిరోడ్డులోని శాంతినగర్లో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునీకీకరించిన చంద్ర బాబునాయుడు పార్కును గురువారం సాయంత్రం ఆయన ప్రా రంభించారు.
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావం ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తదనుగు ణంగా పంటలసాగు ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఖరీఫ్సాగుపై గురు వారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.