Home » Raptadu
మండలంలోని కుంటిమద్ది ఉన్నత పాఠశాల లో ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడంతో ఆ పాఠ శాల పీడీ అజయ్బాబును మంగళవారం సన్మానించారు.
మండలంలో కాసుకో... పోలీస్... అంటూ దొంగలు సవాల్ విసురుతు న్నారు. తరచూ ఏదో ఒక గ్రామంలో పోలీసులకు పట్టుబడకుండా చోరీలు చేస్తున్నారు. ఇంటి తాళం వేశారా... ఆ ఇల్లు గుల్ల కావల్సిందే. దాదాపు ఐదు నెలల నుంచి జరిగిన చోరీలకు సంబంఽ దించి బంగారం, నగదు కలిపి రూ. కోటీ దాకా లూటీ అయి నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పొలాల్లోని పరికాలనూ దొంగలిస్తు న్నారు.
అన్న దాతలను ట్రాన్సఫార్మర్ల కష్టాలు నిత్యం వెంటా డుతున్నాయి. కొత్త సర్వీసుల కోసం దరఖాస్తు చేసు కుని డీడీలు చెల్లించిన వారికి సకాలంలో ట్రాన్స ఫార్మర్లు అందడం లేదు. అలాగే పొలాల్లోని పాత ట్రాన్సఫార్మర్లు పలు కారణాల వలన పాడైనా సకాలం లో కొత్తవి అందడం లేదు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయంతో పాటు ఆ తరువాత అత్యంత ప్రాధాన్యం కల్గిన పశుపోషణ మండలంలో ని రైతులకు భారంగా మారింది. దీనికి తోడు పశువు లకు వ్యాధులు సోకినప్పుడు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి.
సభ్యత్వ నమోదు వల్ల ఉప యోగా ల గురించి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా తెలియ జేసి, మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. ఆమె శనివారం స్వగ్రామమైన వెంకటాపురంలో చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, పంచాయతీల ఆదా యం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజక వర్గంలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఎనఆర్ఈజీఎస్, పీఆర్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే శుక్రవారం నగరంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించడానికి ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువ య్యా యి. అద్దెభవనాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల పాత భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఓ మూ లన ఉన్న గదుల్లో ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్ పేరుతో పలు కొత్త భవనాలను మంజూరు చేసినా, వాటి నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది.
గత వైసీపీ పాలనలో పంచాయతీల అభివృద్ధికి నిధులు లేక పోవ డంతో గ్రామాలు వెలవెలబోయాయి. ఆ ఐదేళ్లలో తూతూ మంత్రంగా గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి మమ అనిపించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పల్లెల రూపు రేఖలు మా రుతున్నాయి. గ్రామాల్లో సీ సీ రోడ్ల నిర్మాణానికి భారీ గా నిధులు మంజూరు చే యడంతో ఇప్పటికే పనులు చేస్తున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో తట్టెడు మట్టి కూడా రోడ్లపై వేయనిదుస్థితి ఉండేదని, అదే కూటమి ప్రభుత్వంలో గుంతల రోడ్లకు మోక్షం లభించిం దని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని కనగానపల్లిలో శనివారం ప్రారంభించారు. స్థానిక పండమేరు వంక వద్ద ఉన్న గతుకుల రోడ్లను చదును చేసి, తారు రోడ్డు నిర్మించే పనులను ఆర్అండ్బీ అధికారుల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛనలను అందిస్తామని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాపురం, శ్రీహరిపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పింఛనలను అందజేశారు.