Home » Rajya Sabha
తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ఇండియా కూటమి పార్టీలు దీనిపై సంతకాలు చేశాయి. ఈ రెండు పార్టీలు అదానీ అంశంపై కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతోపాటు ఆర్ కృష్ణయ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్దల సభకు పంపారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది.
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కె.నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు.
రాజ్యసభలో మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించే విషయంలో జగ్దీప్ ధన్ఖఢ్ వివక్ష చూపుతున్నారని, తాము మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని విపక్ష నేతల అభియోగంగా ఉంది.
షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది.
ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రాజ్యసభ సీట్లను ఆశిస్తూ పలు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు తాజా పరిణామాలతో చల్లబడ్డారు.
రాజ్యసభలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 వద్ద ఒక నోట్ల కట్ట లభ్యమైందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు.
సభలో ఓ సీటు వద్ద లభ్యమైన నగదు ఎవరిదో తెలుసుకునేందుకు విచారణ చేపట్టినప్పుడు, అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రస్తావించడం సమంజసమా అంటూ ఖర్గే ప్రస్తావించారు. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు స్పందిస్తూ..
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్రావు, సానా సతీశ్, ఆర్.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.